బంగారం ఏమైంది
where Did The Gold gone
కేరళలోని తిరుపనంతపురంలో ని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైంది. గత ఏడాది గుడి ఆదాయ, వ్యయాలు, ఆస్తుల వివరాలు బంగారు ఆభరణాల వివరాలు గణించాలని సుప్రీంకోర్టు రాయ్ను ఆదేశించింది .ఆడిట్ నివేదికలో మాజీ కాగ్( కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ) చీఫ్ వినోద్రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు.839 కిలోల బంగారాన్ని వివిధ పనుల నిమిత్తం ఆలయంలోంచి బయటకి తరలించారు. అయితే ఆ బంగారంలో కేవలం 627 కిలోల బంగారం మాత్రమే తిరిగి వచ్చిందని తెలిపారు. మిగతా 266 కిలోల బంగారం ఏమైందన్న విషయం లెక్కల్లో తేలలేదని, ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.